1,101 కేజీల రేషన్ బియ్యం స్వాధీనం
ABN, First Publish Date - 2021-06-22T03:07:56+05:30
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై రవిబాబు కథనం మేరకు, గరిమెనపెంట పం
కొండాపురం, జూన్21: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై రవిబాబు కథనం మేరకు, గరిమెనపెంట పంచాయతీ చల్లావారిపల్లె గ్రామంవద్ద అనుమానాస్పదంగా ఉన్న ఆటోను తనిఖీచేయగా రేషన్ బియ్యం లభ్యమయ్యాయన్నారు. ఆటోలు ఉన్న 1,101 కేజీల బియ్యంతోపాటు ఆటో డ్రైవరు పేరం మాల్యాద్రిని అదుపులోకి తీసుకొని, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.
--------------------
Updated Date - 2021-06-22T03:07:56+05:30 IST