పురుషామృగ వాహనంపై ముక్కంటి
ABN, First Publish Date - 2021-03-09T05:43:40+05:30
నగరంలోని మూలస్థానేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో మూడోరోజు పురుషామృగ వాహనంపై పేట ఉత్సవం ఘనంగా జరిగింది.
నెల్లూరు(సాంస్కృతికం), మార్చి 8 : నగరంలోని మూలస్థానేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో మూడోరోజు పురుషామృగ వాహనంపై పేట ఉత్సవం ఘనంగా జరిగింది. ఉదయం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, క్షీరాభిషేకాలు, చప్పర ఉత్సవం జరిగాయి. సాయంత్రం విశేష పూలంగిసేవ, ప్రత్యేక పూజలు జరిగాయి. రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమాలను ఆలయ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, ధర్మకర్తలు, ఈవో ఏ వేణుగోపాల్ పర్యవేక్షించారు.
Updated Date - 2021-03-09T05:43:40+05:30 IST