ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవ్వాతాతల ఉసురు తగలడం ఖాయం

ABN, First Publish Date - 2021-09-18T03:21:39+05:30

వృద్ధుల పింఛన్లను తొలగించిన వైసీపీ ప్రభుత్వానికి అవ్వాతాతల ఉసురు తగలడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు.

అధికారులకు వినతిపత్రం ఇస్తున్న మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి   


కోవూరు, సెప్టెంబరు 17 : వృద్ధుల పింఛన్లను తొలగించిన వైసీపీ ప్రభుత్వానికి అవ్వాతాతల  ఉసురు తగలడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవ్వాతాతల   భరోసాను పుట్టిముంచిన జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ పోరాడుతుందన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వృత్తికళాకారుల పింఛన్లను  తొలగించడం అన్యామన్నారు. కోవూరు నియోజకవర్గ పరిధిలోనే 2వేల పింఛన్లను తొలగించడం దారుణమన్నారు.  మడమ తిప్పనని ప్రచారం చేసుకుని ఒక్క వాగ్దానాన్ని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నెరవేర్చలేకపోయారన్నారు. అనంతరం  మండల పరిషత్‌ కార్యాలయంలో పింఛన్ల రద్దును నిరసిస్తూ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇంతా మల్లారెడ్డి  చెముకుల కృష్ణచైతన్య, మందా రవికుమార్‌ మాదిగ, బాలారవి, పంది రఘురామ్‌, అత్తిపల్లి శివకుమార్‌రెడ్డి, నాటకరాని వెంకట్‌, కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి, సూరిశెట్టి శ్రీనివాసులు, నక్కా జాన్‌ప్రభాకర్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-18T03:21:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising