ఆటో బోల్తా : నలుగురికి గాయాలు
ABN, First Publish Date - 2021-05-11T03:55:11+05:30
టో బోల్తా పడడంతో నలుగురికి గాయాలయ్యాయి. కొత్తపల్లికి చెందిన పలువురు కూలీలు సోమవారం తనయాలిలో వరినాట్లు వేసేందుకు వెళ్లారు
దొరవారిసత్రం, మే 10: ఆటో బోల్తా పడడంతో నలుగురికి గాయాలయ్యాయి. కొత్తపల్లికి చెందిన పలువురు కూలీలు సోమవారం తనయాలిలో వరినాట్లు వేసేందుకు వెళ్లారు. పని పూర్తయిన అనంతరం ఆటోలో స్వగ్రామానికి తిరిగి వెళుతుండగా పోలిరెడ్డిపాళెం క్రాస్ వద్ద ఆటో బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న సక్కుబాయి, చిట్టెమ్మ, కావలమ్మ, మంగమ్మ గాయపడ్డారు. సక్కుబాయికి కాలు విరిగింది. సూళ్లూరుపేట టోల్ప్లాజా అంబులెన్సు సిబ్బంది క్షతగాత్రులను దొరవారిసత్రం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్సలు చేయించారు. సక్కుబాయిని తిరుపతికి తరలించారు.
Updated Date - 2021-05-11T03:55:11+05:30 IST