ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐసోలేషన్‌ కేంద్రాల ఏర్పాటు : ఆర్డీవో

ABN, First Publish Date - 2021-04-24T03:49:31+05:30

రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో రోగుల సౌకర్యార్థం ఆత్మకూరు డివిజన్‌లో ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆత్మకూరు ఆర్డీవో చైత్రవర్షిణి పేర్కొన్నారు.

వైద్యులతో చర్చిస్తున్న ఆర్డీవో చైత్రవర్షిణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉదయగిరి రూరల్‌, ఏప్రిల్‌ 23: రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో రోగుల సౌకర్యార్థం ఆత్మకూరు డివిజన్‌లో ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆత్మకూరు ఆర్డీవో చైత్రవర్షిణి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఆమె పరిశీలించి వైద్యులతో చర్చించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఆత్మకూరు జిల్లా, అభిరామ్‌, శ్రీవెంకటేశ్వర, వింజమూరు, ఉదయగిరి సీహెచ్‌సీలో 100 పడకలతో ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే ఆత్మకూరు టిడ్కోలో 500 పడకలతో ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఆయా కేంద్రాల్లో 30 నుంచి 40 శాతం అక్సిజన్‌ బెడ్లు కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా వైద్యశాలలో వైద్యులు, సిబ్బంది కొరతను ఆమె దృష్టికి తీసుకెళ్లడంతో జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామన్నారు. అలాగే వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులు ఆరు నెలలుగా వేతనాలు రావడంలేదని, కుటుంబ పోషణ కష్టతరమైందని ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆమె ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వేతనాలు చెల్లించేలా చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు ఫజిహ, వైద్యులు సందానీబాషా, సుభానీబాషా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-24T03:49:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising