ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరాచకం రాజ్యమేలుతోంది

ABN, First Publish Date - 2021-09-18T03:58:05+05:30

ఉండవల్లిలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నివాసంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ ఖండించారు.

విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే పాశిం

గూడూరు, సెప్టెంబరు 17: ఉండవల్లిలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నివాసంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ ఖండించారు. కార్యకర్తల ముసుగులో గుండాలతో తమ ప్రియతమ నేత ఇంటిని ముట్టడించి దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందన్నారు. పోలీస్‌ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. రాష్ట్రాన్ని రావణకాష్టం  చేసేలా ప్రతిపక్ష నాయకుడి ఇంటిపై భౌతికదాడులకు దిగడం దారుణమన్నారు. 

వెంకటగిరి, సెప్టెంబరు 17: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇంటి పై గూండాలతో దాడి చేసిన జోగిరమేష్‌ను వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. అక్రమాలను ప్రశ్నించినందుకు  కేసులు పెట్టడం, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేయడం దారుణమన్నారు. ఈ దారుణాలకు ఒడిగట్టిన జోగిరమేష్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీరామదాసు గంగాధర్‌, పప్పు చంద్రమౌళి రెడ్డి, కేవీకే ప్రసాద్‌ నాయుడు, పోలంరెడ్డి కోటేశ్వరరెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-09-18T03:58:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising