వ్యక్తిగత భద్రత తప్పనిసరిగా పాటించాలి
ABN, First Publish Date - 2021-03-06T04:12:25+05:30
అదానీ కృష్ణపట్నం పోర్టులో ఉద్యోగులు, కార్మికులు వ్యక్తిగత భద్రత తప్పనిసరిగా పాటించాలని పోర్టు మేనేజింగ్ డైరెక్టర్ జీజే రావు పేర్కొన్నారు.
అదానీ కృష్ణపట్నం పోర్టు ఎండీ జీజే రావు
ముత్తుకూరు, మార్చి 5 : అదానీ కృష్ణపట్నం పోర్టులో ఉద్యోగులు, కార్మికులు వ్యక్తిగత భద్రత తప్పనిసరిగా పాటించాలని పోర్టు మేనేజింగ్ డైరెక్టర్ జీజే రావు పేర్కొన్నారు. జాతీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆయన జెండా ఊపి భద్రతా ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో భద్రతా ప్రమాణాలను పాటించాలన్నారు. భద్రత తర్వాతే మిగిలిన అంశాలు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చన్నారు. అనంతరం ఉద్యోగులు, కార్మికులు నినాదాలు చేస్తూ పోర్టులో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో భద్రతా అధికారి సైఫీ, పోర్టు అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2021-03-06T04:12:25+05:30 IST