ఆదమరిస్తే.. అంతే సంగతులు
ABN, First Publish Date - 2021-10-26T03:45:13+05:30
మండలంలో నరుకూరు నుంచి తోటపల్లిగూడూరు వెళ్లే ఆర్అండ్బీ రోడ్డులో వంతెనకు రంధ్రం పడినా సంబంధిత శాఖ అధికారులు చ
నరుకూరు రోడ్డులో బ్రిడ్జికి రంధ్రం
తరచూ ప్రమాదాలు
తోటపల్లిగూడూరు, అక్టోబరు 25 : మండలంలో నరుకూరు నుంచి తోటపల్లిగూడూరు వెళ్లే ఆర్అండ్బీ రోడ్డులో వంతెనకు రంధ్రం పడినా సంబంధిత శాఖ అధికారులు చర్యలు చేపట్టలేదు. ఈ రోడ్డుపై నిత్యం వేలాది మంది ఉద్యోగులు ప్రయాణిస్తుంటారు. ఇటీవల స్కూటరిస్టు ఆ వంతెన గుంతలో పడి స్వల్ప గాయాలతో బయటప డ్డాడు. అంతేకాక ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో రోడ్డు పక్కన ఉన్న గ్రామస్థులు ఆ గుంటకు చుట్టూ మట్టిబస్తాలు వేశారు. ఇటీవల వర్షం కురవడంతో ఆ మట్టి బస్తాలు కరిగిపోయాయి. ఏ ప్రయాణికుడైనా ఆదమరిస్తే.. ప్రమాదానికి గురికావాల్సి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వంతెన రంధ్రానికి మరమ్మతులు చేయాలని నరుకూరు గ్రామస్థులు కోరుతున్నారు.
Updated Date - 2021-10-26T03:45:13+05:30 IST