నెల్లూరు జిల్లాలో తీవ్ర స్థాయికి చేరిన వైసీపీ వర్గ పోరు
ABN, First Publish Date - 2021-02-28T00:23:46+05:30
గూడూరు నియోజకవర్గంలో వైసీపీ వర్గ పోరు తీవ్ర స్థాయికి చేరుకుంది. ఎన్నికల సమయంలో దగ్గరుండి గెలిపించిన నాయకులకు ఎమ్మెల్యే వర ప్రసాదరావు ప్రాధాన్యం ఇవ్వడంలేదని...
నెల్లూరు: గూడూరు నియోజకవర్గంలో వైసీపీ వర్గ పోరు తీవ్ర స్థాయికి చేరుకుంది. ఎన్నికల సమయంలో దగ్గరుండి గెలిపించిన నాయకులకు ఎమ్మెల్యే వర ప్రసాదరావు ప్రాధాన్యం ఇవ్వడంలేదని వైసీపీ సంయుక్త కార్యదర్శి హరిశ్చంద్రారెడ్డి విమర్శలు కురిపించారు. గూడూరు మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో గ్రామ సభల నిర్వహణకు ఎందుకు సహకరించలేదని ఎన్నికలు జరగడం ఇష్టం లేదా అని వర ప్రసాదరావును ప్రశ్నించారు. గూడూరులోని పురాతన సత్రాన్ని ప్రజల అభిప్రాయం లేకుండా కూల్చివేయడం వెనుక మతలబేంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2021-02-28T00:23:46+05:30 IST