Nellore: ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం
ABN, First Publish Date - 2021-09-09T12:53:03+05:30
పొదలకూరు మండలంలోని ప్రభుత్వ స్కూల్స్లో కరోనా కలకలం రేపుతోంది. మర్రిపల్లి, బిరదవోలు, కొత్త కంభాలపల్లి, పులికల్లులోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా టెస్టులు
నెల్లూరు: పొదలకూరు మండలంలోని ప్రభుత్వ స్కూల్స్లో కరోనా కలకలం రేపుతోంది. మర్రిపల్లి, బిరదవోలు, కొత్త కంభాలపల్లి, పులికల్లులోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా టెస్టులు నిర్వహించారు. కరోనా టెస్టుల్లో ఐదుగురు టీచర్లకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో మిగతా టీచర్లకు కూడా అధికారులు కరోనా టెస్టులు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన ఉపాధ్యాయులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరొవైపు పిల్లలని పాఠశాలకు పంపాలంటే తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Updated Date - 2021-09-09T12:53:03+05:30 IST