నాటుసారా స్వాధీనం
ABN, First Publish Date - 2021-01-27T02:47:39+05:30
పశ్చిమ గోదావరి జిల్లాలో 60 లీటర్ల నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలవరం: పశ్చిమ గోదావరి జిల్లాలో 60 లీటర్ల నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలవరం మండలం మనుగోపుల సమీపంలో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడి చేశారు. ఈ దాడిలో 1,600 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. అలాగే 60 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Updated Date - 2021-01-27T02:47:39+05:30 IST