ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మదన్‌మోహన్‌రెడ్డికి జాతీయ విజ్ఞాన అవార్డు

ABN, First Publish Date - 2021-03-01T09:35:02+05:30

పర్యావరణ పరిరక్షణకు చేసిన కృషిలో భాగంగా అనంతపురం జిల్లా తాలూవుల మండలానికి చెందిన గ్రామీణ వ్యవసాయ అభివృద్ధి సంఘానికి జాతీయ గుర్తింపు దక్కింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణకు చేసిన కృషిలో భాగంగా అనంతపురం జిల్లా తాలూవుల మండలానికి చెందిన గ్రామీణ వ్యవసాయ అభివృద్ధి సంఘానికి జాతీయ గుర్తింపు దక్కింది. 2018 ఏడాదికిగానూ ఈ సంఘానికి జాతీయ విజ్ఞాన అవార్డు లభించింది. జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా ఆదివారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో కేంద్ర విజ్ఞాన, సాంకేతిక, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ చేతుల మీదుగా ఆ సంఘం అధ్యక్షుడు బి.మదన్‌మోహన్‌రెడ్డి అవార్డు అందుకున్నారు. కార్యక్రమంలో బెంగళూరుకు చెందిన ఐబీఎం రిసెర్చ్‌ ఇండియా డైరెక్టర్‌ డా.గార్గి బి దాస్‌ గుప్తా కూడా పాల్గొన్నారు. వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో పర్యావరణ పరిరక్షణకు ఈ సంఘం గత కొన్నేళ్లుగా తీవ్రంగా కషిచేస్తోంది. 

Updated Date - 2021-03-01T09:35:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising