ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నర్సులకు 2 నెలల వేతనాన్ని అదనంగా ఇవ్వాలి: నాదెండ్ల మనోహర్

ABN, First Publish Date - 2021-05-12T19:15:15+05:30

అమరావతి: కరోనా సమయంలో రోగులకు నర్సులు చేస్తున్న సేవలను ప్రతి ఒక్కరం గుర్తించి, గౌరవించాలని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కరోనా సమయంలో రోగులకు నర్సులు చేస్తున్న సేవలను ప్రతి ఒక్కరం గుర్తించి, గౌరవించాలని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కోరారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తమ దగ్గర ఉన్న రోగులకు వారు కరుణతో సపర్యలు అందిస్తున్నారన్నారు. ‘సిస్టర్’ అని పిలవగానే తమ కుటుంబ సభ్యులుగా భావించి స్వస్థత కలిగే వరకూ సేవ చేస్తారని మనోహర్ పేర్కొన్నారు. కోవిడ్, ఐసీయూ వార్డుల్లో వారు ఎంతో సాహసంతో విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ఇంత కీలకంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నర్సుల సేవలను ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించాలన్నారు. వారందరికీ ప్రోత్సాహకరంగా ఉండేలా రెండు నెలల వేతనాన్ని అదనంగా ఇవ్వాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.


Updated Date - 2021-05-12T19:15:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising