ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేధావులు, ప్రజలకు, నాయకులకు నారాయణస్వామి విజ్ఞప్తి

ABN, First Publish Date - 2021-09-08T21:38:02+05:30

మేధావులు, ప్రజలకు, నాయకులకు మంత్రి నారాయణస్వామి విజ్ఞప్తి చేశారు. ప్రతిరోజూ కొన్ని మీడియాల్లో అనవసర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మేధావులు, ప్రజలకు, నాయకులకు మంత్రి నారాయణస్వామి విజ్ఞప్తి చేశారు. ప్రతిరోజూ కొన్ని మీడియాల్లో అనవసర, అసత్య ప్రచారం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కడైనా సమస్యలుంటేనే ఉద్యమాలు జరిగేవని తెలిపారు. ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు లిక్కర్‌పై కావాలని ఉద్యమం చేస్తున్నారని తప్పుబట్టారు. చంద్రబాబు గతంలో మద్య నిషేధం పూర్తిగా ఎత్తేశారని గుర్తుచేశారు. నెల్లూరు రోశమ్మ అప్పట్లో మద్య నిషేధంపై ఉద్యమం చేశారని తెలిపారు. ప్రస్తుతం ప్రజల కోరిక మేరకు ఆదాయం లేకపోయినా.. దశల వారీగా మద్య నిషేధం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న మద్యం షాపులు, బెల్ట్ షాపులు తగ్గించడంపై సీఎం జగన్ దృష్టిపెట్టారని నారాయణస్వామి తెలిపారు.

Updated Date - 2021-09-08T21:38:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising