హైకోర్టు తీర్పు.. జగన్ రెడ్డి సర్కారుకి చెంపపెట్టు: లోకేశ్
ABN, First Publish Date - 2021-06-14T19:19:18+05:30
మాన్సాస్ ట్రస్ట్ కేసులో హైకోర్టు తీర్పుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. మాన్సాస్ ట్రస్ట్ని చెరబట్టేందుకు ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టు కొట్టివేయడంతో
అమరావతి: మాన్సాస్ ట్రస్ట్ కేసులో హైకోర్టు తీర్పుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. మాన్సాస్ ట్రస్ట్ని చెరబట్టేందుకు ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టు కొట్టివేయడంతో ధర్మం, చట్టం, న్యాయందే అంతిమ విజయం అని తేలిందని వ్యాఖ్యానించారు. ఈ తీర్పు అప్రజాస్వామికంగా, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అర్ధరాత్రి చీకటి జీవోలు జారీచేస్తోన్న జగన్ రెడ్డి సర్కారుకి చెంపపెట్టుగా అభివర్ణించారు. భూములు, వేల కోట్ల ఆస్తులు ప్రజల కోసం దానమిచ్చిన పూసపాటి వంశీకుల దానగుణానికి, సత్యనిష్టకి న్యాయస్థానం తీర్పు మరింత వన్నెతెచ్చిందన్నారు. అరాచక ప్రభుత్వ పాలనపై సింహాచలం అప్పన్న ఆశీస్సులు, ప్రజాభిమానం, చట్టం, న్యాయం, రాజ్యాంగం సాధించిన విజయమిదన్నారు. న్యాయపోరాటంలో విజయం సాధించిన పెద్దలు అశోక్గజపతిరాజుకి అభినందనలు తెలియజేస్తున్నానని లోకేశ్ పేర్కొన్నారు.
Updated Date - 2021-06-14T19:19:18+05:30 IST