జగన్ దెబ్బకి రిలయన్స్ వెనక్కి.. ట్రైటాన్ జంప్: లోకేష్
ABN, First Publish Date - 2021-06-25T20:58:01+05:30
జగన్ దెబ్బకి రిలయన్స్ వెనక్కి.. ట్రైటాన్ జంప్: లోకేష్
అమరావతి: ఏపీ సర్కారు తీరుతో రెండ్రోజుల్లో దాదాపు 17 వేల కోట్ల పెట్టుబడులు తరలిపోయాయని తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. జగన్ దెబ్బకి రిలయన్స్ వెనక్కి పోయిందని, ట్రైటాన్ జంప్ అయిందంటూ ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో తెచ్చిన లులూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, రిలయన్స్, ట్రైటాన్లను జగన్ తరిమేశారని అన్నారు. డూబు క్యాలెండర్లో ఉద్యోగాల్లేవని కొత్త కంపెనీలు రావడం లేదని, ఉన్నవీ వెళ్లిపోతున్నాయని, ఇలా అయితే యువతకు ఉపాధి ఎలా అని లోకేష్ ప్రశ్నించారు.
Updated Date - 2021-06-25T20:58:01+05:30 IST