జగన్కు నారా లోకేష్ లేఖ
ABN, First Publish Date - 2021-08-19T23:24:43+05:30
సీఎం జగన్కు టీడీపీ నేత నారా లోకేష్ లేఖ రాశారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల్ని ప్రభుత్వం తక్షణమే
అమరావతి: సీఎం జగన్కు టీడీపీ నేత నారా లోకేష్ లేఖ రాశారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు. కొవిడ్ కారణంగా ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారిందమని, కోయిలకుంట్లలో దంపతులు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు పక్క రాష్ట్రాలు ఇచ్చినట్టుగా సాయం అందించాలని డిమాండ్ చేశారు. వారి జీవనోపాధికి భద్రత ఉండేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని లేఖలో లోకేష్ కోరారు.
Updated Date - 2021-08-19T23:24:43+05:30 IST