వెంకటనారాయణపై వైసీపీ దాడిని ఖండించిన నారా లోకేష్
ABN, First Publish Date - 2021-12-21T21:00:24+05:30
టీడీపీ నేత వెంకటనారాయణపై వైసీపీ రాక్షసమూకల చర్యలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు.
గుంటూరు: టీడీపీ నేత వెంకటనారాయణపై వైసీపీ రాక్షసమూకల చర్యలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. సోమవారం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుని ధూషిస్తోన్న వైసీపీ శ్రేణులను ప్రశ్నించడమే నేరమా అన్నారు.తప్పుని తప్పని చెబితే చంపేస్తారా? అని నిలదీశారు. మంచి చెప్పే మనుషుల ప్రాణాలే తీసేస్తారా? అని ప్రశ్నించారు. నిన్న ఒంగోలులో వైశ్యుడైన సొంతపార్టీ నేత సుబ్బారావు గుప్తా, నేడు వెంకటనారాయణ.. రోజుకొకరు వైసీపీ ముఠాలకి బలవ్వాల్సిందేనా? అని ప్రశ్నించారు. ప్రభుత్వమే ఇవన్నీ చేయిస్తోందనేది సుస్పష్టమైందన్నారు.అడ్డుకోవాల్సిన పోలీసులేమయ్యారు? అని నారా లోకేష్ నిలదీశారు.
Updated Date - 2021-12-21T21:00:24+05:30 IST