ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ ఉక్కుని కేంద్రం అమ్మేస్తోంది.. జగన్ రెడ్డి కొంటున్నాడు: నారా లోకేష్

ABN, First Publish Date - 2021-03-09T19:47:42+05:30

అమరావతి: విశాఖ ఉక్కును కేంద్రం అమ్మేస్తోందని.. ఏపీ సీఎం జగన్ కొనుగోలు చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: విశాఖ ఉక్కును కేంద్రం అమ్మేస్తోందని.. ఏపీ సీఎం జగన్ కొనుగోలు చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. గంగిరెద్దుల్లా తలాడించడానికి 28 మంది ఎంపీలున్నారని.. ప్రజల హక్కులు కాపాడలేని వారు ఎంత మంది ఉండి ఉపయోగమేంటని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. ‘‘విశాఖ ఉక్కుని కేంద్రం అమ్మేస్తుంది. జగన్ రెడ్డి కొంటున్నాడు.ఓకే సార్ అంటూ గంగిరెద్దుల్లా తల ఆడించడానికి 28 మంది ఎంపీలు ఎందుకు దండగ. ప్రజల హక్కులు కాపాడలేని వారు ఎంత మంది ఉండి ఉపయోగం ఏంటి? విశాఖ ఉక్కుని తుక్కులా కొట్టేయడానికి జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా వాటిని భగ్నం చేసేందుకు ఎంత దూరమైనా వెళ్తాం. అన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పే చేస్తున్నాం, జగన్ రెడ్డి అంగీకారంతోనే విశాఖ ఉక్కు అమ్మకం ప్రక్రియ జరుగుతోందని కేంద్రం స్పష్టం చేసింది. విశాఖ ఉక్కు పరిరక్షణ పేరు చెప్పి లేఖలతో జగన్ రెడ్డి పిరికి కాలక్షేపం,వైకాపా నాయకుల డ్రామాలు ఆపాలి’’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.  




Updated Date - 2021-03-09T19:47:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising