రమ్య హత్య నిందితుడికి ఉరి ఎప్పుడు: లోకేశ్
ABN, First Publish Date - 2021-08-23T01:46:11+05:30
రమ్య హత్య నిందితుడికి ఉరి ఎప్పుడు: లోకేశ్
విజయవాడ: ఏపీ పోలీసు అధికారుల సంఘాన్ని తన మీదకి ఉసిగొల్పడానికి పడ్డ శ్రమ మహిళల రక్షణ కోసం పెట్టి ఉంటే జగన్ రెడ్డి పాలనలో రోజుకో ఆడబిడ్డ బలై ఉండేది కాదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఇప్పటికైనా రాజకీయ కక్షసాధింపు పక్కన పెట్టి మహిళల భద్రతపై దృష్టి పెట్టాలని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకా 14 రోజులే మిగిలాయని, విద్యావంతురాలైన రమ్యని హత్య చేసిన వాడికి ఉరి ఎప్పుడని నారా లోకేశ్ ప్రశ్నించారు.
Updated Date - 2021-08-23T01:46:11+05:30 IST