ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనూష కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలి: నన్నపనేని రాజకుమారి

ABN, First Publish Date - 2021-02-27T21:44:01+05:30

ఇటీవల గుంటూరులో దారుణ హత్యకు గురైన విద్యార్థి అనూష కుటుంబానికి కళాశాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ఇటీవల గుంటూరులో దారుణ హత్యకు గురైన విద్యార్థి అనూష కుటుంబానికి కళాశాల యాజమాన్యం నష్ట పరిహారం చెల్లించాలని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాజకుమారి మాట్లాడుతూ విద్యార్థిని అనూష దారుణ హత్య తనను తీవ్రంగా బాధించిందన్నారు. అనూష కుటుంబ సభ్యులకు కళాశాల యాజమాన్యం నష్ట పరిహారం చెల్లించాలని ఆమె కోరారు. పిల్లలపై నిరంతరం తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలని ఆమె సూచించారు.   ఆటోలో అనూషని విష్ణువర్ధన్ రెడ్డి బలవంతంగా తీసుకెళ్లేటప్పుడు తోటి విద్యార్థులు మానవతా దృక్పథంతో నిలువరించి ఉంటే బాగుండేదని ఆమె అభిప్రాయపడ్డారు. 




అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆమె స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కేవలం ఉద్యోగస్తులదే అని అన్నారు. అయితే స్టీల్ ప్లాంట్‌‌ను తనదిగా భావించి ప్రతి ఆంధ్రుడు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఆమె పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం దాదాపు 70 గ్రామాల ప్రజలు తమ భూములను త్యాగం చేశారని ఆమె పేర్కొన్నారు. విశాఖ ఉక్కుకోసం అధికార పార్టీ ముందుండి పోరాడాలని ఆమె సూచించారు. దానికి అన్ని పార్టీలు తమ మద్దతు తెలుపాలని రాజకుమారి పేర్కొన్నారు. 


Updated Date - 2021-02-27T21:44:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising