ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నామినేటెడ్ పదవుల్లో సామాజిక న్యాయం ఏమైంది?: నాగజగదీశ్వరరావు

ABN, First Publish Date - 2021-07-25T17:44:35+05:30

బడుగు బలహీన వర్గాలకు వైసీపీ ప్రభుత్వం దయాదాక్షిణ్యంతో పదవులు ఇవ్వడం లేదని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: బడుగు బలహీన వర్గాలకు వైసీపీ ప్రభుత్వం దయాదాక్షిణ్యంతో పదవులు ఇవ్వడం లేదని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సలహాదారులు, ముఖ్యమైన నామినేటెడ్ పదవుల్లో సామాజిక న్యాయం ఏమైందని ప్రశ్నించారు. కార్యాలయాలు, అధికారాలులేని కార్పొరేషన్ పదవులను బలహీలన వర్గాలకు ఇచ్చి ప్రధాన పదవులను సొంత సామాజిక వర్గానికి కట్టబెట్టడం సామాజిక న్యాయం ఎలా అవుతంది జగన్మోహన్ రెడ్డి? అంటూ నిలదీశారు.


 సామాజిక న్యాయం పాటించామని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం తప్ప పదవులు పొందిన వారి నోటి నుంచి రావడం లేదంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చునని నాగజగదీశ్వరరావు అన్నారు. సామాజిక న్యాయాన్ని తలకిందులు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగనేనని విమర్శించారు. పెద్ద పదవులకు బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అర్హులు కాదా.?అని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలకు అధికారం కోసం టీడీపీ పోరాడుతుందని నాగజగదీశ్వరరావు స్పష్టం చేశారు.

Updated Date - 2021-07-25T17:44:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising