కేంద్ర మంత్రిపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం: నాదెండ్ల మనోహర్
ABN, First Publish Date - 2021-05-07T01:41:02+05:30
కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి మురళీధరన్పై బెంగాల్లో జరిగిన దాడిని
అమరావతి : కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి మురళీధరన్పై బెంగాల్లో జరిగిన దాడిని ఖండిస్తున్నామని జనసేన ఓ ప్రకటనలో పేర్కింది. ఈ వార్త తమకు బాధ కలిగించిందని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇది చాలా దురుదృష్టకరమైన ఘటన అని, ప్రజాస్వామ్య వాదులందరూ దీనిని ఖండించాలని కోరారు. ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్లో వరుసగా ఇలాంటి హింసాత్మక ఘటనలే జరుగుతున్నాయని ఆక్షేపించారు. కేంద్రమంత్రి కాన్వాయ్పైనే దాడి జరిగిందంటే బెంగాల్ పరిస్థితులను ఊహించుకోవచ్చని మనోహన్ పేర్కొన్నారు.
Updated Date - 2021-05-07T01:41:02+05:30 IST