ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారికి జీతాలు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టడం బాధాకరం: నాదెండ్ల మనోహర్

ABN, First Publish Date - 2021-07-31T23:26:15+05:30

వారికి జీతాలు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టడం బాధాకరం: నాదెండ్ల మనోహర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ని ఏపీ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. జీతాలు ఇవ్వక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ... ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్లుని క్రమబద్ధీకరిస్తామని పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారని, ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడు జీతాల విషయాన్ని కూడా పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. 1100 మంది ఈ తరహాలో విధులు నిర్వర్తిస్తున్నా, పాఠాలు చెప్పిన గంటల లెక్కన రూ.10 వేల లోపు జీతాలు చెల్లించాల్సి ఉన్నా ఆ విషయాన్ని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ విస్మరించిందన్నారు. గెస్ట్ లెక్చరర్లను ప్రభుత్వం జీతాలు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయం నుంచి జీతాల బకాయిలు ఉండిపోయాయన్నారు. అప్పటి ప్రభుత్వం చేసిన తప్పిదాన్నే ఈ ప్రభుత్వమూ కొనసాగిస్తోందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం తక్షణమే వీరికి బకాయిపడ్డ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జనసేన పార్టీ కచ్చితంగా వీరికి అండగా ఉంటుందన్నారు.

Updated Date - 2021-07-31T23:26:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising