‘పశ్చిమ’లో సర్పంచ్పై హత్యాయత్నం
ABN, First Publish Date - 2021-04-09T08:46:34+05:30
పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం దూసనపూడి గ్రామ సర్పంచ్ జనసేన పార్టీకి చెందిన యర్రంశెట్టి నాగసాయిపై వైసీపీకి చెందిన కొందరు కత్తులు...
వీరవాసరం, ఏప్రిల్ 8: పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం దూసనపూడి గ్రామ సర్పంచ్ జనసేన పార్టీకి చెందిన యర్రంశెట్టి నాగసాయిపై వైసీపీకి చెందిన కొందరు కత్తులు, కర్రలతో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. హుటాహుటిన ఆయన్ను భీమవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో మెరుగైన చికిత్సకు ఏలూరు జిల్లా ఆస్పత్రికి తరలిస్తున్నారు. పరిషత్ ఎన్నికల వివాదం నేపథ్యంలో అదే గ్రామానికి చెందినవారు ఈ దారుణానికి పాల్పడ్డారని జనసేన తరపున జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుండా జయప్రకాశ్ నాయుడు ఆరోపించారు.
Updated Date - 2021-04-09T08:46:34+05:30 IST