ఆర్థిక ఎమర్జెన్సీ విధించే సమయం దగ్గరలోనే ఉంది: సుజనా
ABN, First Publish Date - 2021-12-29T01:35:32+05:30
ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఎంపీ సుజనాచౌదరి అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించే సమయం దగ్గర్లో ఉందన్నారు.
అమరావతి: ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఎంపీ సుజనాచౌదరి అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించే సమయం దగ్గర్లో ఉందన్నారు. ఏపీలో ఆటవిక రాజ్యం నడుస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రజలను సీఎం జగన్రెడ్డి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇసుక, మద్యం, మైనింగ్ పేరుతో దోచుకుంటున్నారని ఆరోపించారు. మద్య నిషేధం పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుడి చేత్తో పథకాలకు ఇచ్చి ఎడమ చేత్తో లాక్కుంటున్నారని విమర్శించారు. అలాగే ఓటీఎస్ పేరుతో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కాకుండా కేసుల మాఫీ కోసమే ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
Updated Date - 2021-12-29T01:35:32+05:30 IST