కోర్టులపై జస్టిస్ చంద్రు వ్యాఖ్యలను ఖండించిన MP Raghurama
ABN, First Publish Date - 2021-12-11T19:16:06+05:30
కోర్టులపై జస్టిస్ చంద్రు వ్యాఖ్యలను ఎంపీ రఘురామకృష్ణంరాజు ఖండించారు.
న్యూఢిల్లీ: కోర్టులపై జస్టిస్ చంద్రు వ్యాఖ్యలను ఎంపీ రఘురామకృష్ణంరాజు ఖండించారు. జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు చాలా బాధాకరమన్నారు. జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు అవగాహన రాహిత్యంగా ఉన్నాయని తెలిపారు. జగన్ సర్కార్ తీసుకునే ప్రజావ్యతిరేక విధానాలపై జస్టిస్ చంద్రు నిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవుపలికారు. జస్టిస్ చంద్రుతో న్యాయస్థానాలకు వ్యతిరేకంగా జగన్ మాట్లాడించినట్లు ఉందన్నారు. ప్రజావ్యతిరేక నిర్ణయాలు కోర్టుల్లో నిలబడవన్న సంగతి జస్టిస్ చంద్రుకు ఎందుకు అర్థం కావడం లేదని ఎంపీ రఘురామ అన్నారు.
Updated Date - 2021-12-11T19:16:06+05:30 IST