ఇది దగాపడ్డ రైతుల సభ: ఎంపీ రఘురామ
ABN, First Publish Date - 2021-12-17T21:14:52+05:30
పట్టణంలో జరగుతున్న రాజధాని అమరావతి రైతుల ముగింపు
తిరుపతి: పట్టణంలో జరగుతున్న రాజధాని అమరావతి రైతుల ముగింపు సభను దగాపడ్డ రైతుల సభగా ఎంపీ రఘురామ అభివర్ణించారు. ముగింపు సభలో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇది రాజకీయ సభ కాదన్నారు. ఈ సభ తర్వాత మూడు రాజధానుల గురించి మాట్లాడే వారు ఎవరూ ఉండరని ఆయన అన్నారు. న్యాయపరంగా 100 శాతం అమరావతే రాజధానిగా ఉంటుందని ఆయన భరోసా వ్యక్తం చేశారు. మంత్రి బొత్స మాటలు అరువు మాటలని ఆయన ఎద్దేవా చేశారు. సత్తిబాబు చెడ్డవాడు కాదు, అలా అని మంచివాడని తాను అనడం లేదన్నారు. మనం జాలి పడాలి తప్ప బొత్స మాటలు విని బాధపడకూడదని ఆయన పేర్కొన్నారు.
Updated Date - 2021-12-17T21:14:52+05:30 IST