మున్సిపల్ చైర్మన్లు వచ్చినా ఆనందం లేదా..?: రఘురామ
ABN, First Publish Date - 2021-03-18T19:45:57+05:30
తనపై వైసీపీ ప్రభుత్వం ప్లాన్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీ: వైసీపీ ప్రభుత్వం తనపై ప్లాన్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రఘురామ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జగన్ రాజ్యాంగం నడుస్తోందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం రైతులను ఒప్పించి రాజధానికి భూములు తీసుకుందని స్పష్టంచేశారు. ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగిందంటూ తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏమైనా ఎస్సీ సామాజికవర్గానికి చెందినవారా? అని రఘురామ ప్రశ్నించారు. 75కి 74 మున్సిపల్ చైర్మన్లు వచ్చినా ఆనందం లేదా అని రఘురామ నిలదీశారు. వైసీపీ ప్రభుత్వ తీరు చూస్తుంటే ఎన్నికలే అవసరం లేదనిపిస్తోందన్నారు. నందిగం సురేష్, రెడ్డప్పలతో ఎవరో మాట్లాడిస్తున్నారని రఘురామ ప్రశ్నించారు.
Updated Date - 2021-03-18T19:45:57+05:30 IST