ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహాపాదయాత్రకు సోమవారం సెలవు

ABN, First Publish Date - 2021-11-06T20:12:51+05:30

అమరావతి రైతుల మహాపాదయాత్రకు సోమవారం సెలవు ప్రకటించారు. ఆదివారం రాత్రికి ప్రకాశం జిల్లా ఇంకొల్లు మహాపాదయాత్ర చేరుకోనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు: అమరావతి రైతుల మహాపాదయాత్రకు సోమవారం సెలవు ప్రకటించారు. ఆదివారం రాత్రికి ప్రకాశం జిల్లా ఇంకొల్లు మహాపాదయాత్ర చేరుకోనుంది. కార్తీక సోమవారం కావటంతో పాదయాత్రకు సెలవు ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఉదయం ఇంకొల్లు నుంచి యథావిధిగా పాదయాత్ర కొనసాగుతుందని నిర్వహకులు తెలిపారు. ఆంధ్రుల ఏకైక రాజధాని అమరావతి పరిరక్షణే ధ్యేయంగా రాజధాని మహిళలు, రైతులు చేపట్టిన ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పాదయాత్ర జన ప్రభంజనంలా ముందుకు సాగుతోంది. యాత్ర శనివారంతో ఆరో రోజుకు చేరింది. పాదయాత్రకు కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు మద్దతు తెలిపారు. టీడీపీ, కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఐ నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2021-11-06T20:12:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising