దేశద్రోహం కేసు నమోదు చేయాలి: ఎమ్మెల్యే సత్యప్రసాద్
ABN, First Publish Date - 2021-04-19T09:49:59+05:30
నకిలీ ఓటరు కార్డు తయారు చేయడం నకిలీ నోట్లను తయారు చేయడం కన్నా ప్రమాదకరం. తిరుపతి ఉప ఎన్నికలో
అమరావతి, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): నకిలీ ఓటరు కార్డు తయారు చేయడం నకిలీ నోట్లను తయారు చేయడం కన్నా ప్రమాదకరం. తిరుపతి ఉప ఎన్నికలో ఓటేసేందుకు నకిలీ ఓటరు కార్డులను తయారు చేసిన వారిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలి. దానిపై విచారణ జరపాలి. దోషులెవరైనా శిక్షించాలి’’ అని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఆదివారం ఆయన ఓ ప్రకటన చేశారు.
Updated Date - 2021-04-19T09:49:59+05:30 IST