ఇండిగో విమానంపై నష్టపరిహారం కేసు పెడతాం: రోజా
ABN, First Publish Date - 2021-12-14T21:38:14+05:30
ఇండిగో విమాణం ప్రయాణీకులకు చుక్కలు చూపించింది. తిరుపతిలో ల్యాండ్ కావలసిన విమానం...
అమరావతి: ఇండిగో విమాణం ప్రయాణీకులకు చుక్కలు చూపించింది. తిరుపతిలో ల్యాండ్ కావలసిన విమానం గంటపాటు గాలిలోనే చక్కర్లు కొట్టింది. ఆ సమయంలో విమానంలో ఉన్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే రోజా, జోగీశ్వరరావు సహా ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. తిరుపతిలో ల్యాండ్ చేయలేక ప్రయాణీకులను బెంగళూరుకు తీసుకువెళ్లి వదిలిపెట్టారు. వాస్తవంగా టెక్నికల్ సమస్యతో విమానాన్ని ల్యాండింగ్ చేయలేకపోయారని రోజా ఆరోపించారు. అసలు విషయం చెప్పకుండా వాతావరణంమీద సాకులు చెప్పారని ఆమె అన్నారు. తిరుపతిలో దించకుండా బెంగళూరులో దించారని ఒక్కో ప్రయాణీకుడి నుంచి రూ. 5వేలు డిమాండ్ చేశారని రోజా అన్నారు. తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఇండిగో విమాన సంస్థపై నష్టపరిహారం కేసు పెడతామని అన్నారు. ఇక విమానంలో సమస్యలపై యాజమాన్యం సరిగా స్పందించలేదని, వాతావరణ సమస్యా లేక సాంకేతిక సమస్యా అనే విషయంలో స్పష్టత ఇవ్వడం లేదని యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2021-12-14T21:38:14+05:30 IST