జగన్ది రైతు దగా ప్రభుత్వం: నిమ్మల
ABN, First Publish Date - 2021-05-09T20:03:34+05:30
కొవిడ్ కష్టాలతో పాటు ధాన్యం కొనుగోలు కష్టాలతో.. రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
ఏలూరు: కొవిడ్ కష్టాలతో పాటు ధాన్యం కొనుగోలు కష్టాలతో.. రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. రైతులకు సాయం మరిచిన జగన్ది రైతు దగా ప్రభుత్వం అని నిమ్మల వ్యాఖ్యానించారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జగన్ సర్కారు విఫలమయుందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతు సమస్యలకు పరిష్కరించాలని నిమ్మల రామానాయుడు తెలిపారు.
Updated Date - 2021-05-09T20:03:34+05:30 IST