ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లారీ డ్రైవర్లకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి: ఎమ్మెల్యే అనగాని

ABN, First Publish Date - 2021-02-27T20:28:38+05:30

కరోనా కారణంగా చితికిపోయిన లారీ డ్రైవర్లకు ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించి వారిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కరోనా కారణంగా చితికిపోయిన లారీ డ్రైవర్లకు ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించి వారిని ఆదుకోవాలని సీఎం జగన్‌ను టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య‌ప్రసాద్ కోరారు. లారీ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం జగన్‌కు ఎమ్మెల్యే అనగాని లేఖ రాశారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి రవాణా రంగాన్ని ఆదుకోవాలని అనగాని ఆ లేఖలో పేర్కొన్నారు. కరోనా కారణంగా లారీ డ్రైవర్లు ఆర్థికంగా బాగా చితికిపోయారని ఆయన తెలిపారు. లారీ డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన కోరారు. డీజిల్, టోల్ ట్యాక్స్ తగ్గించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 


ఇ-వే బిల్ సమయం పెంచి లారీ యజమానులకు ఉపశమనం కలిగించాలన్నారు. తక్షణమే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. లారీ డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించాలని ఆయన కోరారు. టీడీపీ హయాంలో తాము ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా పథకం లారీ డ్రైవర్లను ఆదుకుందని ఆయన తెలిపారు. జగన్ సీఎం అయిన తరువాత చంద్రన్న బీమా పథకాన్ని వైసీపీ ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేదని ఆ లేఖలో అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.

Updated Date - 2021-02-27T20:28:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising