చిన్నారులకు మంత్రి కొడాలి పరామర్శ
ABN, First Publish Date - 2021-03-09T21:06:04+05:30
అస్వస్థతకు గురైన చిన్నారులకు మెరుగైన వైద్యం అందిస్తామని
కృష్ణా: అస్వస్థతకు గురైన చిన్నారులకు మెరుగైన వైద్యం అందిస్తామని మంత్రి కొడాలి నాని తెలిపారు. గుడివాడ ఆర్సీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను మంత్రి నాని పరామర్శించారు. చిన్నారులంతా వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన తెలిపారు. చిన్నారుల అందరిని క్షేమంగా ఇంటికి పంపించే ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు. చిన్నారులు తాగిన వాటర్, తిన్న బిస్కెట్లు, చాక్లెట్ల శాంపిల్స్ సేకరించి ల్యాబ్ పంపామని మంత్రి కొడాలి నాని తెలిపారు.
Updated Date - 2021-03-09T21:06:04+05:30 IST