మూడు రాజధానులకే ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి బొత్స
ABN, First Publish Date - 2021-12-16T19:10:58+05:30
మూడు రాజధానులకే ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
అమరావతి: మూడు రాజధానులకే ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతిలో రైతుల పేరిట రేపు జరగబోయేది రాజకీయ సభ అన్నారు. రియల్ ఎస్టేట్ ద్వారా దోచుకోవడమే టీడీపీ లక్ష్యమన్నారు. అమరావతే కాదు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పారు.పాదయాత్రలో పాల్గొన్నది టీడీపీ వాళ్లేనన్నారు. ప్రాంతీయ అసమానతలు ఉండొద్దనే మూడు రాజధానులను చేస్తున్నామన్నారు. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్ ఏర్పాటు చేయాలన్నదే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. టీడీపీకి ఆ 29 గ్రామాలు, సామాజికవర్గమే ముఖ్యమని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
Updated Date - 2021-12-16T19:10:58+05:30 IST