పవన్ కల్యాణ్ది అవగాహన రాహిత్యం: మంత్రి బొత్స
ABN, First Publish Date - 2021-10-09T01:16:49+05:30
ఉద్యోగుల జీతాలపై జనేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అవగాహన రాహిత్యంగా
నెల్లూరు: ఉద్యోగుల జీతాలపై జనేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆగడం లేదన్నారు. ఉద్యోగులకు జీతాలు ఒకటి రెండు రోజులు ఆలస్యం అవుతున్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. ఇతరులిచ్చిన స్క్రిప్ట్ను పవన్ కల్యాణ్ చదువుతారని ఆయన పేర్కొన్నారు. సినిమాల్లో ఈ స్క్రిప్ట్ను చదివితే బాగుంటుందని మంత్రి బొత్స ఎద్దేవా చేసారు.
Updated Date - 2021-10-09T01:16:49+05:30 IST