విద్యుత్ ఉద్యోగుల జీతాలు తగ్గించడం లేదు: మంత్రి బాలినేని
ABN, First Publish Date - 2021-06-14T23:06:30+05:30
రాష్ట్రంలో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగుల జీతాలు తగ్గించడం అనేది లేదని మంత్రి
అమరావతి: రాష్ట్రంలో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగుల జీతాలు తగ్గించడం అనేది లేదని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. 2018 పీఆర్సీ ప్రకారమే వారికి జీతాలు ఉంటాయని మంత్రి బాలినేని తెలిపారు. 2022 వరకు ఇవే జీతాలు కొనసాగుతాయని మంత్రి బాలినేని పేర్కొన్నారు. రాబోయే రెండు నెలల్లో ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్ వేస్తామని బాలినేని ప్రకటించారు. గత ప్రభుత్వం హయాంలో 80 వేల కోట్ల అప్పులు ఉన్నాయని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
Updated Date - 2021-06-14T23:06:30+05:30 IST