రోశయ్య మృతి పట్ల ఏపీ మంత్రి Alla nani సంతాపం
ABN, First Publish Date - 2021-12-04T15:15:47+05:30
మాజీ సీఎం కొణిజేటి రోశయ్య అకాల మరణం పట్ల ఏపీ డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానితీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
అమరావతి: మాజీ సీఎం కొణిజేటి రోశయ్య అకాల మరణం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానితీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, రాజకీయ చతురత కలిగిన నాయకుడు రోశయ్య మరణం అత్యంత బాధాకరమన్నారు. దివంగత నేత వైస్ రాజశేఖరరెడ్డికి శిష్యుడు రోశయ్య అని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సుధీర్గ కాలంగా ఆర్ధిక శాఖ మంత్రిగా రోశయ్య పని చేశారని గుర్తుచేశారు. రోశయ్యకి భగవంతుడు ఆత్మ శాంతి ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నానని మంత్రి తెలిపారు. వివాదరహితుడుగా రాజకీయాల్లో ఒక గుర్తింపు పొందిన నాయకుడు రోశయ్య అని కొనియాడారు. రాజకీయాల్లో ఎందరికో మార్గదర్శకుడుగా నిలిచారన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు అర్ధం చేసుకొని రోశయ్య బడ్జెట్ రూప కల్పన చేశారని చెప్పుకొచ్చారు. విద్యార్థి దశ నుండి ముఖ్యమంత్రి, గవర్నర్ స్థాయికి ఎదిగిన మహా నాయకుడు రోశయ్య అని అన్నారు. రోశయ్య కుటుంబ సభ్యులకు మంత్రి ఆళ్లనాన్ని తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Updated Date - 2021-12-04T15:15:47+05:30 IST