గంజాయి, డ్రగ్స్పై ప్రతిపక్షాలు విమర్శిస్తే సమాధానం చెప్పాలి: హర్షకుమార్
ABN, First Publish Date - 2021-10-21T00:51:41+05:30
గంజాయి, డ్రగ్స్పై ప్రతిపక్షాలు విమర్శిస్తే సమాధానం చెప్పాలని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
అమరావతి: గంజాయి, డ్రగ్స్పై ప్రతిపక్షాలు విమర్శిస్తే సమాధానం చెప్పాలని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాట్లాడే తీరు సరిగాలేనందుకే దాడులు జరిగాయని తెలిపారు. టీడీపీ నేత పట్టాభి ఇంటిపై వైసీపీ దాడిచేయడాన్ని సీఎం జగన్ సమర్థిస్తున్నారని తప్పుబట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు అహంకారంగా వ్యవహరించిన విధంగానే జగన్ ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. జగన్ కక్షపూరిత ధోరణితో వ్యవహరించడం సరికాదన్నారు. వైసీపీ, టీడీపీలు శాంతియుత వాతావరణానికి సహకరించాలని హర్షకుమార్ కోరారు.
Updated Date - 2021-10-21T00:51:41+05:30 IST