ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏవోబీలో మావోల డంప్‌ స్వాధీనం

ABN, First Publish Date - 2022-01-01T02:09:41+05:30

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో శుక్రవారం మావోయిస్టులకు చెందిన డంప్‌ను ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీలేరు: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో శుక్రవారం మావోయిస్టులకు చెందిన డంప్‌ను ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మల్కన్‌గిరి జిల్లా సబ్‌ డివిజనల్‌ పోలీస్‌ అధికారి అభిషేక్‌ శుక్రవారం విలేఖరులకు అందజేశారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో తాబేరు-అర్లింగ్‌పాడ గ్రామాల మధ్య గల అటవీ ప్రాంతంలో బీఎస్‌ఎఫ్‌, మల్కన్‌గిరి పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా మావోయిస్టులకు చెందిన డంప్‌ లభ్యమైంది. ఈ డంప్‌లో ఆరు క్యారేజ్‌ ఎల్‌ఈడీలు, రెండు ప్రెజర్‌ ఎన్‌ఈడీలు, ఒక మీటర్‌ కొడాక్స్‌ వైర్‌, ఒక ఇన్‌సాస్‌ మ్యాగ్జన్‌, ఒక ఐఈడీ మెకానిజమ్‌, మావోయిస్టు యూనిఫామ్‌ ఒక జత, 9 వాట్స్‌ బ్యాటరీ ఒకటి, 3 వాట్స్‌ బ్యాటరీలు మూడు, విప్లవ సాహిత్యం, మందులు లభ్యమయ్యాయి. ఇటువంటి డంప్‌లు ఈ ప్రాంతంలో ఇంకా వున్నట్టు తమకు సమాచారం ఉందని, వాటి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని ఆయన చెప్పారు. 

Updated Date - 2022-01-01T02:09:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising