అంతా మహాపెరియార్స్వామి ఆశీర్వాదం: తమిళిసై
ABN, First Publish Date - 2021-12-17T01:58:37+05:30
తానీ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అంతా కంచి మహా స్వామీజీ మహాపెరియార్ ఆశీర్వాదమని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.
విశాఖపట్నం: తానీ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అంతా కంచి మహా స్వామీజీ మహాపెరియార్ ఆశీర్వాదమని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. బాల్యం నుంచే ఏటా కంచికి వెళ్లి స్వామి దర్శనం చేసుకోవడం తనకు అలవాటని, అక్కడి స్వామీజీలతో ఎంతో పరిచయం వుందని చెప్పారు. గురువారం విశాఖ విచ్చేసిన ఆమె శంకరమఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు పండితులు వేదాశీర్వాదం అందించారు. తమిళిసై శంకరమఠం హాలులో శంకరాచార్యుల చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించి సమస్కరించారు. అనంతరం మాట్లాడుతూ ధనుర్మాసం ప్రారంభం రోజు శంకరమఠాన్ని సందర్శించడం, అదీ తన కొడుకు, కోడలితో కలిసి వేదపండితుల ఆశీర్వాదం అందుకోవడం చాలా ఆనందంగా ఉందని తమిళిసై పేర్కొన్నారు.
Updated Date - 2021-12-17T01:58:37+05:30 IST