మదనపల్లెలో జంట హత్యల కేసులో పేరెంట్స్కి జైలు
ABN, First Publish Date - 2021-01-27T02:24:04+05:30
మదనపల్లెలో జంట హత్యల కేసులో నిందితులైన తల్లిదండ్రులకు కోర్టు రిమాండ్ విధించింది. తల్లిదండ్రులు పద్మజ, పురుషోత్తంపై
చిత్తూరు: మదనపల్లెలో జంట హత్యల కేసులో నిందితులైన తల్లిదండ్రులకు కోర్టు రిమాండ్ విధించింది. తల్లిదండ్రులు పద్మజ, పురుషోత్తంపై హత్యానేరం కింద కేసు నమోదైంది. పద్మజ, పురుషోత్తంలకు 14 రోజులు కోర్టు రిమాండ్ విధించింది. మూఢ భక్తితో ఇద్దరు కుమార్తెలను తల్లిదండ్రులు చంపేశారు. నిందితులను మదనపల్లె సబ్జైలుకు పోలీసులు తరలించారు. తల్లి పద్మజకు కరోనా టెస్టులు చేసే సమయంలో చాలా హంగామా చేసింది.
Updated Date - 2021-01-27T02:24:04+05:30 IST