ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వ్యాఖ్యలపై లోకేష్ తీవ్ర అభ్యంతరం
ABN, First Publish Date - 2021-10-21T23:02:34+05:30
ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
అమరావతి: ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రఘురామిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సైకో రెడ్డిని కూడా టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా చేర్చాలన్నారు. ‘‘జగన్రెడ్డి మీకే కాదు మాకూ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్లకి బీపీ వస్తే నువ్వు ఏపీలో ఉండవు’’ అని నారా లోకేష్ హెచ్చరించారు.
మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వైసీపీ చేపట్టిన ప్రజాగ్రహ దీక్షలో పాల్లొన్న ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ మంగళగిరిలో కాబట్టి టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి చేశారు.. అదే రాయలసీమలో అయితే ఖూనీలు జరిగేవని హెచ్చరించారు. టీడీపీ కార్యాలయాలపై దాడి జరిగితే రాష్ట్ర బంద్ చేస్తారా అని రఘురామిరెడ్డి ప్రశ్నించారు.
Updated Date - 2021-10-21T23:02:34+05:30 IST