ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోకేష్‌ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు: కన్నబాబు

ABN, First Publish Date - 2021-04-05T22:10:03+05:30

టీడీపీ నేత లోకేష్‌ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మంత్రి కన్నబాబు తప్పుబట్టారు. మాజీ సీఎం చంద్రబాబు గురించి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: టీడీపీ నేత లోకేష్‌ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మంత్రి కన్నబాబు తప్పుబట్టారు. మాజీ సీఎం చంద్రబాబు గురించి ఏం మాట్లాడాలో తెలియడం లేదని, యుద్ధం మధ్యలో తోకముడిచి పలాయనం చిత్తగించారని ఎద్దేవాచేశారు. టీడీపీ ఎంపీ గెలిస్తే పెట్రోల్‌ రేట్లు ఎలా తగ్గుతాయో లోకేష్‌ చెప్పాలన్నారు. విశాఖ స్టీల్‌, ప్రత్యేక ప్యాకేజీ గురించి కేంద్రాన్ని ప్రశ్నించకుండా.. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారని కన్నబాబు దుయ్యబట్టారు. 


వైసీపీకి, లోకసభలో 21 మంది, రాజ్యసభలో ఆరుగురు ఎంపీలు ఉండి ఏం చేశారని లోకేశ్‌ ప్రశ్నించిన విషయం తెలిసిందే. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ పార్లమెంటులో వైసీపీ ఎంపీలు గొర్రెలమందగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘‘తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌, విమానాశ్రయ విస్తరణ, స్మార్ట్‌సిటీ గురించి ఏనాడైనా మాట్లాడారా? ఒక్క రూపాయి తెచ్చారా?’’ అని ప్రశ్నించారు. పార్లమెంటులో టీడీపీకి ముగ్గురే ఎంపీలున్నా సింహాల్లా గర్జిస్తున్నారని, సమస్యలపై పోరాడుతున్నారన్నారు.


Updated Date - 2021-04-05T22:10:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising