దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి: లోకేష్
ABN, First Publish Date - 2021-10-05T02:16:20+05:30
దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి: లోకేష్
అమరావతి: వైసీపీ పాలనలో దళితులకు రక్షణ లేదని టీడీపీ నేత నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో దళిత సర్పంచ్ మాచర్లపై వైసీపీ నేతలు దాడి చేశారని చెప్పారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఒళ్లు బలిసి దళితులపై దాడులు చేస్తున్న వైసీపీ నేతలకు బుద్ధి చెప్పాల్సింది పోయి.. పోలీసులు నిందితులను రక్షించే ప్రయత్నాలు చేయడం బాధాకరమన్నారు. సర్పంచ్ మాచర్లపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Updated Date - 2021-10-05T02:16:20+05:30 IST