ఏపీలో స్థానిక ఎన్నికలపై ప్రజల ఆసక్తి..
ABN, First Publish Date - 2021-01-25T16:48:27+05:30
ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ను ప్రజలు సమర్ధిస్తున్నారు.
అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ను ప్రజలు సమర్ధిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఓటర్లు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేయాలనటం.. సామాన్యులకు తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. ఎన్నికలు సకాలంలో జరిగితేనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని గ్రామీణ ప్రజానీకం భావిస్తోంది.
పంచాయతీ ఎన్నికలు ఎంత త్వరగా నిర్వహిస్తే అంత మంచిదని గ్రామీణ ప్రజలు అంటున్నారు. స్థానిక సంస్థలకు పరిపాలకులు ఉండడంవల్ల అభివృద్ధి గాడినపడుతుందని చెబుతున్నారు. రెండున్నరేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలో తిన్నామా.. పండామా అన్న చందంగా ఉందన్నారు. ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం కోరడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. దేశం అంతటా ఎన్నికలు జరుగుతున్న వేళ ఏపీలో మాత్రం వద్దని వాదించడం సరికాదని అంటున్నారు.
Updated Date - 2021-01-25T16:48:27+05:30 IST