ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో మద్యం ధరలు తగ్గించాలి: విష్ణుకుమార్‌రాజు

ABN, First Publish Date - 2021-12-31T23:48:57+05:30

ఏపీలో మద్యం ధరలు తగ్గించాలని బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: ఏపీలో మద్యం ధరలు తగ్గించాలని బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సినిమా టికెట్ ధరలు తగ్గించి మద్యం ధరలు పెంచడం ఏంటి? అని ప్రశ్నించారు. ఈ విషయంపై సోమువీర్రాజు వ్యాఖ్యలను పెడార్ధాలు తీస్తున్నారని తప్పుబట్టారు. ఎక్కడా కనిపించని మద్యం బ్రాండ్స్ ఏపీలో ఉన్నాయన్నారు. కష్టపడి పనిచేసే వారినుంచి మద్యం పేరుతో జగన్ సర్కార్ దోచుకుంటోందని దుయ్యబట్టారు. మద్యం బ్రాండ్స్ చాలా తక్కువ ధరకు కొనుగోలుచేసి... 10 రెట్లకు ఎక్కువ ధరకు అమ్ముతున్నారని విష్ణుకుమార్‌రాజు ఆరోపించారు. 


‘‘అన్నిరాష్ట్రాల్లో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంటే.. ఏపీలో జగన్ రాజ్యాంగం నడుస్తోంది. ఇంత వరకు రాక్షస పాలనభరించాం. ఇకభరించే ఓపిక మాకు లేదు. వచ్చే ఏడాది రాజకీయ ఒడిదుడుకులు జగన్‌కి తప్పదని భావిస్తున్నాం. ఇదే విధంగా ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తే.. వచ్చే ఎన్నికల్లో జగన్‌కి 15 సీట్లు కూడా రావు. ఎప్పుడు ఎవరు జైల్‌కి వెళ్తారో నాకు తెలియదు. ఎక్కువ రోజులు బెయిల్ మీద ఉన్న వ్యక్తి జగనే’’ విష్ణుకుమార్‌రాజు తెలిపారు.

Updated Date - 2021-12-31T23:48:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising