ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2021-10-01T21:59:12+05:30

తెలుగు అకాడమీ ఛైర్మన్ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తెలుగు అకాడమీ ఛైర్మన్ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ వారసుడు లోకేష్ కాదని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అని చెప్పారు. చంద్రబాబు వారసుడు ఎవరో త్వరలో తేలబోతుందన్నారు. టీడీపీ నేతలు రాసిచ్చే స్క్రిప్ట్‌నే పవన్ చదువుతున్నారని ఎద్దేవాచేశారు. తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌పై  టీడీపీ, జనసేనలు అవగాహన లేకుండా విమర్శిస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో దుర్వినియోగం అయిన నిధులకు ఏపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి రూపాయి నిధులు కూడా ఏపీకి రాలేదని తెలిపారు. తెలుగు అకాడమీ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ వస్తాయని చెప్పారు. తెలుగు భాషను బతికించేది వైసీపీ ప్రభుత్వమేనని లక్ష్మిపార్వతి స్పష్టం చేశారు.

Updated Date - 2021-10-01T21:59:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising