వైసీపీ కాలగర్భంలో కలుస్తుంది
ABN, First Publish Date - 2021-11-22T05:12:20+05:30
స్ర్తీలను అవమానించినవారు బాగుపడ్డ దాఖలాలు లేవని, తెలుగుదేశం అధినేత సతీమణి పట్ల అనుచితంగా మాట్లాడిన వైసీపీ త్వరలోనే కాలగర్భంలో కలసిపోవటం ఖాయమని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి అన్నారు.
మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి
బండి ఆత్మకూరు, నవంబరు 21: స్ర్తీలను అవమానించినవారు బాగుపడ్డ దాఖలాలు లేవని, తెలుగుదేశం అధినేత సతీమణి పట్ల అనుచితంగా మాట్లాడిన వైసీపీ త్వరలోనే కాలగర్భంలో కలసిపోవటం ఖాయమని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి అన్నారు. ఆదివారం బండిఆత్మకూరు మండలంలోని రామాపురం గ్రామంలో ఓ కార్యక్రమానికి బుడ్డా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో రెండు రోజుల క్రితం మంత్రి కొడాలి నాని, ఎంఎల్ఏలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, చంద్రశేఖర్రెడ్డి సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించారని అన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి వెనకుండి ఈ వ్యాఖ్యలు చేయించారన్నారు. వీటన్నింటినీ ప్రజలు గమనించారని, త్వరలో వైసీపీకి రాజకీయ సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఇప్పటికైనా సీఎం, వైసీపీ ఎమ్మెల్యేలు భేషరతుగా మాజీ సీఎం చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Updated Date - 2021-11-22T05:12:20+05:30 IST